అమెరికా చిప్ దిగ్గజం Nvidia,మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా Microsoftను అధిగమించి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.2025 జూన్ 4 నాటికి Nvidia మార్కెట్ విలువ $3.34 ట్రిలియన్ డాలర్లకు చేరగా,Microsoft విలువ $3.32 ట్రిలియన్ డాలర్ల వద్ద నిలిచింది.
ఈ విజయానికి ప్రధాన కారణం AI (Artificial Intelligence) రంగంలో Nvidia కీలక పాత్ర పోషించడం.ప్రపంచంలోని అనేక పెద్ద టెక్ కంపెనీలు Google,Amazon,Meta, OpenAI తమ AI మోడళ్లకు అవసరమైన GPU (Graphics Processing Units) కోసం ప్రాధాన్యంగా Nvidia తయారుచేసే H100 మరియు GH200 చిప్లపై ఆధారపడుతున్నాయి.
నిన్నటి వరకు Apple,Microsoft లాంటి దిగ్గజ కంపెనీల దాటి ప్రపంచంలో మొదటి స్థానానికి చేరడం Nvidia చరిత్రలో గణనీయమైన మైలురాయి.CEO జెన్సెన్ హువాంగ్ నేతృత్వంలో,Nvidia 2022 తర్వాత AI బూమ్కు కేంద్రబిందువుగా మారింది.
ఈ విజయంతో,Nvidia స్టాక్ ధర 3.5% పెరిగి $135.58 వద్ద ముగిసింది.గత సంవత్సరంలో కంపెనీ షేర్ ధరలు దాదాపు 200% పెరిగాయి.ఇది పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.
AI, డేటా సెంటర్లు,హెచ్పీసీ లాంటి రంగాల్లో Nvidia యొక్క ఆధిక్యత వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది.ఈ జైంట్ కంపెనీ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బద్దలుకొట్టే అవకాశముంది.