2025 మే 7న, అమెరికా 9వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ మైక్రోసాఫ్ట్ $69 బిలియన్ విలువైన Activision Blizzard కొనుగోలుపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) వేసిన అప్పీల్ను తిరస్కరించింది.ఈ తీర్పుతో, 2023లో పూర్తయిన ఈ డీల్కి న్యాయ అనుమతి లభించింది.
FTC, 2022లో ఈ విలీనంపై వ్యతిరేకంగా కేసు వేసింది.విలీనంతో Xbox, క్లౌడ్ గేమింగ్, సబ్స్క్రిప్షన్ మార్కెట్లలో పోటీ తగ్గుతుందని FTC వాదించింది. అయితే, 2023 జూలైలో US డిస్ట్రిక్ట్ జడ్జి జాక్వెలిన్ స్కాట్ కార్లీ, FTC వాదనలను సమర్థించలేదని తీర్పు ఇచ్చారు. దీంతో FTC అప్పీల్కి వెళ్లింది.
తాజా తీర్పులో, ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ఏకగ్రీవంగా FTC అప్పీల్ను తిరస్కరించింది.FTCఈ విలీనంతో పోటీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది.
ఈ డీల్ వీడియో గేమింగ్ పరిశ్రమలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద కొనుగోలు.”Call of Duty” వంటి ప్రముఖ గేమ్లను అభివృద్ధి చేసిన Activision Blizzardను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడం ద్వారా,గేమింగ్ రంగంలో తమ స్థానం మరింత బలోపేతం చేసుకుంది.
FTC, ఈ తీర్పుపై స్పందించలేదు.మైక్రోసాఫ్ట్ కూడా వ్యాఖ్యానించలేదు.