ఆచార్య : మెగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ !

ఆచార్య మూవీ ఫ్రీ రిలీజ్ :

ఎప్పుడేపుడు అని వేచి ఉన్న మెగా ఫాన్స్ కి పెద్ద పండగలాగా ఆచార్య సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా  కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా తాజాగా సెన్సార్ పనులు పుర్తిచేసుకోన్నది. అయ్యితే ఇవాళ ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇవాళ ఏప్రిల్ 23 న సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆచార్య ప్రి రిలీజ్.

ఈ సినిమాలో రాంచరణ్ ముక్యపాత్రా వహించారు, ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ‘భలే భలే బంజారా’ పాటకు విశేష స్పందన లభిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా తెరకెక్కింది.

ఇక ఇవాళ ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇవాళ (ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా హాజరుకానున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరు వస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు.

ఆచార్య సినిమా ఫ్రీ రిలీజ్ కి ఆతిధిగా పవన్ :

ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని ముందు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ ఈ ఈవెంట్‌కు హాజరవట్లేదు. అయితే తాజా సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ నేడు(23వ తేదీన) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడం లేదు.

పవన్ కళ్యాణ్ జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరిలో పర్యటించనున్న పవన్ కల్యాణ్ ఆ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు రావడం లేదు. ఇక ఈ వేడుకకు ఆయన రావట్లేదు అన్న విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. పవన్ ఆచార్య ఈవెంట్‌కు వచ్చి ఉంటే అన్నాతముళ్ళను ఒకే వేదిక మీద ఉంటే ఆ కిక్ వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

ఫ్రీ రిలీజ్ బందో భాస్తూ : 

ఇక యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇక పాస్‌తో వచ్చే వ్యక్తులను మాత్రమే ఈవెంట్‌కు అనుమతించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాస్‌ లేనివారిని లోపలికి అనుమతించేది లేదని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి 

Leave a Comment