ప్రధాని మోడీ మన దేశం ఒకటే బాగుండాలి అని అనుకోరు, మనదేశం తో పాటు ఇతర దేశాలు కూడా బాగుండాలి అని యూరప్ కి పర్యటన కు వెళ్ళినారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఉక్రెయిన్ మరియు రష్యా పోటాపోటిగా యుధం సాగింది, అందులో చాలామంది సైనికుల ప్రాణాలు కోల్పోయినారు. అలాగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తో పాటుగా చాల మంది ప్రజల ప్రాణాలు కూడా విడిచారు. ఇలా చాల మంది ప్రాణాలు, వారి ఆస్తులు మొత్తం అన్ని పోగోటుకొన్నారు రెండు దేశాల ప్రజలు.
ప్రధాని మోడీ వెళ్ళిన పర్యటన ఎలా సాగిందో చూదం! మూడు యూరప్ దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్లో ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్తో కలిసినారు, ప్రధాని నరేంద్ర మోదీ. భారత కాల మానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి వేళా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా మాక్రోన్తో భేటీని ఇద్దరు మిత్రుల కలయికగా అభివర్ణించారు ప్రధాని మోడీ బుధవారం సాయంత్రం ఫ్రాన్స్లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ. యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని బుధవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో భేటీ అయ్యారు.
ద్వైపాక్షిక అంశాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ద సంక్షోభం గురించి నేతలు చర్చించుకున్నట్లు పీఎంవో తెలిపింది. జర్మనీ, డెన్మార్క్ పర్యటనలు ముగించుకున్నతర్వాత మోదీ బుధవారం పారిస్ చేరుకున్నారు. ప్యారిస్లోని అధ్యక్ష అధికార భవనం ఎల్వైసీ ప్యాలెస్కి చేరుకున్నారు. అక్కడ వీళ్లద్దిరు కలవడం జరిగినది, ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలీసీకి చేరుకున్న మోదీకి, మెక్రాన్ ఆలింగనాలతో స్వాగతం పలికారు. ఇటీవలే రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన మెక్రాన్ కు మోదీ అభినందనలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ద నివారణ, దాని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలుగుతోన్న నష్టాలకు నివారణ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవడం తదితర అంశాలపై మోదీ-మెక్రాన్ చర్చించుకున్నారు.
భారత్ ఫ్రాన్స్ మద్య దౌత్య సంబంధాలకు 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో మోదీ పారిస్ పర్యటనకుప ప్రాధాన్యం ఏర్పడింది. మోదీ గత ఎనిమిదేళ్లలో ఫ్రాన్స్ లో పర్యటించడం ఇది ఐదోసారి. మెక్రాన్ తో మోదీ భేటీని ఇద్దరు స్నేహితుల కలయికగా విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు.
నమస్తే ప్యారిస్ అంటూ తన ఫ్రాన్స్ పర్యటన ప్రారంభమైందని ట్వీట్ చేసిన మోదీ ఫ్రాన్స్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు బుధవారం ఉదయం డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో జరిగిన 2వ ఇండియా-నార్డిక్ ప్రధానుల సదస్సులో మోదీ పాల్గొన్నారు.