టెలికం దిగ్గజం ZTE ఇప్పుడు 5G-A (Advanced) సాంకేతికత ద్వారా సాంస్కృతిక పర్యాటకం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.ప్రత్యేకించి చైనాలోని ప్రాచీన పర్యాటక ప్రాంతాల్లో, ఇది వినియోగదారులకు ఇమర్సివ్ (Immersive) అనుభూతులను అందించేందుకు పని చేస్తోంది.
ZTE, ప్రముఖ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ China Unicom తో కలిసి, 5G-A ఆధారిత టెక్నాలజీని వివిధ హోట్స్పాట్లలో ప్రవేశపెడుతోంది.వీటిలో హై స్పీడ్ నెట్వర్క్స్,AI ఆధారిత మార్గదర్శక వ్యవస్థలు,మరియు AR/VR అనుభూతుల ద్వారా పర్యాటకులు ఆ ప్రాంతపు చరిత్రను ప్రస్తుత కాలంలో అనుభవించగలుగుతున్నారు.
ఉదాహరణకి,చైనాలోని ప్రసిద్ధ Longmen Grottoes వద్ద పర్యాటకులకు AR గ్లాసెస్ ద్వారా పురాతన శిల్పాలను త్రీడీ విజువల్స్గా చూపించే విధానం అమలు అవుతోంది.ఇది పర్యాటక అనుభవాన్ని మరింత ప్రాణంతమైనదిగా,విజ్ఞానపూర్వకంగా మారుస్తోంది.
ZTE ప్రకారం,5G-A టెక్నాలజీ ద్వారా,హై బాండ్విడ్, లో లేటెన్సీ,మరియు మాస్ కనెక్టివిటీ లక్షణాల వల్ల పెద్దసంఖ్యలో పర్యాటకులకు ఏకకాలంలో నాణ్యమైన అనుభవం ఇవ్వగలుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ టూరిజం అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.